ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో బిటి రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు. రహదారుల నిర్మాణాలకు మంథని మండలంలోని నాగారం x రోడ్ నుండి కన్నాల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రూ. 2.50 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ గుమ్మునూర్ నుండి కాకర్లపల్లి వయా దొంతులపల్లి వరకు రూ. 3.75 కోట్లు, చిన్న ఓదాల నుండి మానేరు వరకు కోటి రూపాయలు, పిడబ్ల్యుడి రోడ్ నుండి విలోచవరం వయా అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు రూ. 1.82 కోట్లు సిఆర్ఆర్, డిఎంఎఫ్ టి గ్రాంట్ల ద్వారా నిధులు మంజూరయ్యాయి. తమ గ్రామాలలో రవాణ సౌకర్యాలు మెరుగు పడటానికి నిరంతరం పాటుపడుతున్న మంత్రి శ్రీధర్ బాబుకు మంథని పట్టణ ప్రజలతో పాటు సర్పంచులు గుడిసె గట్టయ్య యాదవ్, చెరుకు తోట సురేష్, నాగుల శారద రాజయ్య, లక్కాకుల సత్యనారాయణ, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News