ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రం లోని అన్నదాతలకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం పంపిణీ ప్రక్రియలో భాగంగా 7, 8 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు మంగళవారం జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.ఇప్పటికే 6 విడతల్లో 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సాయం అందించగా, ఇప్పుడు 7 నుంచి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. రైతుభరోసా అమలు ప్రారంభమైన తర్వాత కేవలం ఏడు రోజుల్లో నే రూ.7,750.45 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో పెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక భరోసా కల్పిం చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 68.96 లక్షల మంది రైతులకు రైతుభరోసా సాయం అందింది. మొత్తం 129.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి రూ.7,750.45 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు.
Admin
E Nivas News