ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బూత్ నియోజకవర్గం లోని ప్రధానమైన రోడ్లను మంజూరు చేయాలని సోమవారం బూతు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్ లో ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గలా ప్రధానమైన రోడ్లను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారుబోథ్ పట్టణంలో బీటీ రోడ్డు మరియు సీసీ రింగ్ రోడ్డు మరియు లైటింగ్ నిర్మాణానికి రూ. 5 కోట్లుపోచ్ఛర ఎక్స్ రోడ్డు నుంచి బోథ్ టౌన్ వరకు ఫోర్ లైన్ తో పాటు సెంట్రల్ లైగ్టింగ్ మరియు మైనర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 38 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగేఇచ్చొడ మండల కేంద్రంలో ఫోర్ లైన్ నిర్మాణంలో భాగంగా సైడ్ డ్రైన్ నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి అనిల్ నీ మాట కాదనను అని వెంటనే నిధులు మంజూరు చేయాలని ఈ అండ్ సి కి ఆదేశాలు జారీచేశారు.
Admin
E Nivas News