Wednesday, 29 July 2026 12:03:07 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

కెసిఆర్ రాకతో మళ్లీ పూర్వ వైభవం రానుందా...

గులాబీమయమైన జగిత్యాల

Date : 19 April 2026 11:01 PM Views : 171

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టానికి జగిత్యాల వేదిక కాబోతుంది. రేపు జగిత్యాల పట్టణంలో నిర్వహిస్తున్న బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్న ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ శ్రేణులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పట్టణమంతా గులాబీ తోరణాలతో పాటు ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఈ సభకు నేరుగా మాజీ ముఖ్యమంత్రి రావడం వల్ల అధికారులు ప్రత్యేకమైన భద్రతను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి, సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి,పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు పార్టీ ఫిరాయింపుదారులకు అందలం ఎక్కిస్తూ కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన నాయకులు,కార్యకర్తలను చిన్నచూపు చూడడాన్ని నిరసిస్తూ ఇటీ వలే కాంగ్రెస్‌ను వీడడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి జీవన్‌ రెడ్డి సమ్మతిని తెలియజేశారు. కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ చేరేందుకు సిద్ధమయ్యారు. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటు న్న వివిధ సమస్యలపై సమరశంఖం పూరిస్తూ జీవన్‌రెడ్డిని తమతో కలు పుకొని కాంగ్రెస్‌పై యుద్ధం చేసేందుకు ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహి రంగ సభను నిర్వహించా లని వారం క్రితమే నిర్ణయిం చగా అప్ప టి నుంచే అందరి చూపూ సభపైనే నెలకొన్నది. కేసీఆర్‌ ప్రసంగంపైనే ఆసక్తి జగిత్యాల జిల్లాలోని 20 మండలాల పరిధిలోని గులాబీ శ్రేణులు పల్లెలు పట్నాల్లోని గడప గడపకూ కలియదిరుగుతూ, సభకు పెద్ద సంఖ్యలో తరలిరావా లని విజయవంతం చేయాల నికోరుతున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావి స్తూ, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ లను తుంగలో తొక్కిందని మళ్లీ పోరాటం చేస్తేనే తెచ్చుకున్న తెలంగాణలో తిరిగి బాగు పడుతామని, అందుకు జగిత్యాల సభతో నే నాంది పడుతుందని, గులాబీ పెద్దలు ప్రచారం చేస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :