Thursday, 15 January 2026 05:41:50 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

మీ బ్యాంకు అకౌంట్ నుంచే ట్రాఫిక్ చలాన్లు కట్ అవుతాయి...

సిఎం రేవంత్ రెడ్డి

Date : 13 January 2026 10:13 PM Views : 24

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : వాహనదారులు నిబంధన లకు విరుద్దంగా వాహనం నడుపుకుంటూ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారని కాగాఆ చలాన్లను మనకు వీలున్న ప్పుడు చెల్లించుకునే అవకాశం ఉండేదని మరీ ఎక్కువ చలాన్లు పడితే వాహనాలను ట్రాఫిక్ పోలీ సులు సీజ్ చేసేవారన్నారు.త్వరలో చలాన్ల వసూళ్ల విషయంలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విధానం ద్వారా మీ వాహనంపై చలాన్ పడిన కొద్దిసేపటికే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయని తెలిపారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో సోమవారం సాయంత్రం అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథి గా పాల్గొని మాట్లాడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన దారులపై కఠినంగా వ్యవ హరించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని, దీనికి మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నపడం వంటి ప్రధాన కార ణాలు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి, ఓ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై ఇకపై ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు. చలాన్ పడిన వెంటనే వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. ఇందుకోసం వాహనం రిజిస్ట్రేషన్సమయంలోనే యాజమాని బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. ఏదైనా నిబంధన అతిక్రమించి చలాన్ పడితే జరిమానా మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ అయ్యేలా సాంకేతికతను తీసుకురావాలని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.ట్రాఫిక్ క్రమశిక్షణ అనేది పాఠశాల దశ నుంచే అలవడాలని. విద్యార్థుల సిలబస్‌లో రోడ్డు భద్రత అంశాలను చేర్చాలని విద్యాశాఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రవాణా, పోలీస్ శాఖలు సమన్వ యంతో పనిచేసినప్పుడే రోడ్డు ప్రమాద రహిత తెలం గాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రోడ్డు భద్రత విభాగంలో పనిచేయడాన్ని శిక్షగా భావించే ధోరణిని మార్చాలని సీఎం రేవంత్ అన్నారు. ఇకపై ఈ విభాగా నికి డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారులను నియమించిఈ రంగాన్ని హైడ్రా లేదా సైబర్ క్రైమ్ విభాగాల తరహాలో శక్తివంతంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన రవాణా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :