ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23 న ఆదివారం ఉదయం 6గంటలకు నిర్వహించే ఐదు కిలోమీటర్ల రన్ ఫర్ అరెస్పీ కార్యక్రమం గోడ ప్రతులను కాగజనగర్ టౌన్ ఎన్టీఆర్ చౌరస్తా లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు, ఆరెస్పీ అభిమానులు,పార్టీ నాయకులు గోడ ప్రతులను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఏ ఒక్కరు అనారోగ్య బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా రన్ - రీడ్ లీడ్ లక్ష్యంగా కార్యక్రమంలు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆద్వర్యం లో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని, అందులో భాగంగా ఐదు కిలోమీటర్ల రన్ ఫర్ ఆర్.ఎస్.పి పేరుతో ఏస్పీఎం గ్రౌండ్ నుండి మొదలై ముగింపు కూడా అక్కడే ఉంటుందని తెలిపారు. రన్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి టీ షర్ట్ మెడల్ తో పాటు మొదటి ముగ్గురికి బహుమతులు కూడా అందజేస్తామన్నారు. వివరాలకు 9493900100, 98482 72929 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
Admin
E Nivas News