ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అమరవీరుల ఆశయాలు కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ డివిజన్ కార్యదర్శి సునకారి రాజేష్ కోరారు. ఆదివారంనిర్మల్ జిల్లా కడెం మండలం లోని మిద్దె చింత గ్రామంలో భూమి బుక్తి భారతదేశ విముక్తి కోసం విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునరికారి రాజేష్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం, విప్లవోద్యమంలో ప్రజల కోసం పోరాటం చేసి తమ ప్రాణాలు అర్పించారు.చనిపోయిన అమరవీరుల ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ ప్రాంతంలో భూస్వాముల చేతిలో హత్య గురైన కామ్రేడ్ గట్ల గంగన్న, పోరాటంలో చనిపోయిన ఆకుల సత్తన్న మానుక దేవన్న తదితరులు ఎందరో అమరులైనారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ పేరుతోటి బూటకపు ఎన్కౌంటర్లు చేసి అడవిలో ఉన్న ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తు లు ఆదాని అంబానీలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. జీవించే హక్కు కాలరాస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు అర్బన్ నక్సలైట్లు అంటూ తీవ్రంగా అణచివేస్తుందన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలను అమలు చేస్తుందని అంబానీ అదాని లకు గులంగిరి చేస్తూ కోట్లాది రూపాయల దేశ సంపదను కుల్లగొట్టుకపోవడానికి గేట్లు తెరిచింది. ఆదివాసి, గిరిజనులు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను టైగర్ జోన్ పేరుతో లాక్కునే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది. ప్రజల సమస్యలు గాలికి వదిలి కులమతాలతో పాలన కొనసాగిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం లింగన్న, అధ్యక్షులు ఆత్రం మాణిక్ రావు, సోయం బలవంతురావ్, దుందిరావ్, ఆత్రం గేదం మోహన్ రావు, చందు, మార్సుకోల మోతిరామ్, భీమ్రావు లింగు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News