ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామం నుండి దౌడపల్లి గ్రామం వరకు సుమారు ₹2.89 కోట్లవ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీట్ రోడ్, సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావుపాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతు ఈ రోడ్డు నిర్మాణంతో కొత్త కొమ్ముగూడెం, దౌడపల్లి గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతుందని అన్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు ఎంతో కీలకమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. అనంతరం సురేఖమ్మ శాలువాతో స్థానిక సర్పంచ్ సందేల సుజాత -సురేష్ గ్రామస్తులు, నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు,సర్పంచ్ నలిమెల రాజు, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మంచిర్యాల జిల్లా ఆర్ జి పి ఎస్ గడ్డం త్రిమూర్తి, మండల వైస్ ప్రెసిడెంట్ కందుల మోహన్, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు, బియ్యాల తిరుపతి, మండల మాజీ అధ్యక్షులు పింగిలి రమేష్, లక్షెట్టిపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉప సర్పంచ్ బొప్పు సుమన్ , కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News