Saturday, 13 June 2026 02:22:01 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఏజెన్సీలో ఎస్సీల రిజర్వేషన్స్ లో అన్యాయం జరుగుతుంది.

Date : 24 November 2025 09:04 PM Views : 183

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ఏరియాల్లోని ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోళ్ళ రాయమల్లు ఆరోపించారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ2011 జనాభా లెక్కల ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలకు వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ కేటాయించడం అనేది 2018 వరకు జరిగిందన్నారు. కానీ 2018 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలో ఎస్సీ వార్డ్ సభ్యుల ఎన్నికకు రిజర్వేషన్స్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలను మినహాయించి మిగతా అన్ని వర్గాల వారికి 2018 నుంచి నేటి ఎన్నికల వరకు నూతన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్స్ కల్పిస్తున్నాయని వివరించారు. ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలు జన్మించడమే తప్పా? అని ప్రశ్నించారు. ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీ వార్డ్స్ రిజర్వేషన్స్ తొలగించడం వలన ఉప సర్పంచ్ పదవి తమ వర్గాలకు అందకుండా పోతుందన్నారు.అనంతరం అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు చిప్పకుర్తి నారాయణ మాట్లాడుతూ జనాభాలో రెండున్నర శాతం ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్స్ ఇచ్చి బీసీ,ఇతర బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎస్సీ పాలకులు ఈ వచ్చే ఎన్నికల్లో ఎస్సీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక మండల ప్రెసిడెంట్ చొప్పదండి రమేష్,మండల నాయకులు తోటపల్లి మహేందర్, లింగంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :