Thursday, 30 July 2026 02:29:59 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఏజెన్సీలో ఎస్సీల రిజర్వేషన్స్ లో అన్యాయం జరుగుతుంది.

Date : 24 November 2025 09:04 PM Views : 199

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ఏరియాల్లోని ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోళ్ళ రాయమల్లు ఆరోపించారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ2011 జనాభా లెక్కల ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలకు వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ కేటాయించడం అనేది 2018 వరకు జరిగిందన్నారు. కానీ 2018 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలో ఎస్సీ వార్డ్ సభ్యుల ఎన్నికకు రిజర్వేషన్స్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలను మినహాయించి మిగతా అన్ని వర్గాల వారికి 2018 నుంచి నేటి ఎన్నికల వరకు నూతన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్స్ కల్పిస్తున్నాయని వివరించారు. ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలు జన్మించడమే తప్పా? అని ప్రశ్నించారు. ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీ వార్డ్స్ రిజర్వేషన్స్ తొలగించడం వలన ఉప సర్పంచ్ పదవి తమ వర్గాలకు అందకుండా పోతుందన్నారు.అనంతరం అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు చిప్పకుర్తి నారాయణ మాట్లాడుతూ జనాభాలో రెండున్నర శాతం ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్స్ ఇచ్చి బీసీ,ఇతర బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎస్సీ పాలకులు ఈ వచ్చే ఎన్నికల్లో ఎస్సీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక మండల ప్రెసిడెంట్ చొప్పదండి రమేష్,మండల నాయకులు తోటపల్లి మహేందర్, లింగంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :