ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి మందులను అందుబాటులో ఉంచి ప్రజల సంక్షేమం కొరకు తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రి పరిధిలో కొనసాగుతున్న మార్చురీ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News