ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. మంచిర్యాలలో మంగళవారం ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న బస్సుల దుస్థితిని చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు బహిర్గతమయ్యాయి బస్సుల్లో అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఫస్ట్ఎయిడ్ (ప్రథమ చికిత్స) బాక్సులు లేకపోవడం, టైర్లు పూర్తిగా అరిగిపోయి (తేలిపోయి) ఉండటం గమనించిన డీటీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసభద్రతాప్రమాణాలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలేస్తున్న ఇలాంటి ప్రమాదకర బస్సుల గురించి తల్లిదండ్రులు సైతం తెలుసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.నిబంధనలుఉల్లంఘించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన రెండు రోజుల్లో నిబంధనలు పాటించని 5 స్కూల్ బస్సులను సీజ్ చేశామని డీటీవో తెలిపారు. విద్యార్థుల భద్రతే తమ ప్రాధాన్యమని, రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఎక్కడైనా కాలం చెల్లిన స్కూల్ బస్సులు నడిపించినట్లయితే సమాచారం అందించిన వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు.
Admin
E Nivas News