Sunday, 13 September 2026 01:34:09 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్

Date : 16 June 2026 09:35 PM Views : 112

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. మంచిర్యాలలో మంగళవారం ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న బస్సుల దుస్థితిని చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. ​జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు బహిర్గతమయ్యాయి బస్సుల్లో అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఫస్ట్‌ఎయిడ్ (ప్రథమ చికిత్స) బాక్సులు లేకపోవడం, టైర్లు పూర్తిగా అరిగిపోయి (తేలిపోయి) ఉండటం గమనించిన డీటీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసభద్రతాప్రమాణాలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలేస్తున్న ఇలాంటి ప్రమాదకర బస్సుల గురించి తల్లిదండ్రులు సైతం తెలుసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.​నిబంధనలుఉల్లంఘించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన రెండు రోజుల్లో నిబంధనలు పాటించని 5 స్కూల్ బస్సులను సీజ్ చేశామని డీటీవో తెలిపారు. విద్యార్థుల భద్రతే తమ ప్రాధాన్యమని, రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఎక్కడైనా కాలం చెల్లిన స్కూల్ బస్సులు నడిపించినట్లయితే సమాచారం అందించిన వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :