Thursday, 30 July 2026 03:30:15 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

చిన్నారుల ఆరోగ్య సంరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం..

ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ప్రారంభం

Date : 13 July 2026 10:38 PM Views : 64

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చిన్న వయస్సు నుంచే పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణవాడలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగావిద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి, ఈ బృహత్తర కార్యక్రమాన్నిఅధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల సమస్య వల్ల రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపం ఏర్పడి, వారి శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నులిపురుగుల నిర్మూలనతోనే పిల్లలు ఆరోగ్యంగా,ఉత్సాహంగా ఎదుగుతారని పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలందరికీ వంద శాతం మాత్రలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ,విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు వసతి ద్వారాను పిల్లలకు ఆల్బజండాల్ మాత్రలు వైద్య సిబ్బంది వేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం.. అనంతరం,పాఠశాల ప్రాంగణంలో చిన్నారి విద్యార్థులకు కలెక్టర్ స్వయంగాఅక్షరాభ్యాసం చేయించారు. పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. చిన్నతనం నుంచే పిల్లలకు మంచి విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం మన అందరి బాధ్యత అనిగుర్తుచేశారు. అనంతరంఎస్.ఐ.ఆర్.ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫారాలను త్వరతితగిన స్వీకరించి డిజిటలిజేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని బి.ఎల్.ఓ, సూపర్వైజర్లను ఆదేశించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాధవి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాధన, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వై.సి.శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ, స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: