Wednesday, 29 July 2026 12:14:03 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

జనసంద్రంగా మారిన తెలంగాణ కుంభమేళ..

వన దేవతలను దర్శించుకుంటున్న లక్షలాది మంది భక్తులు

Date : 30 January 2026 11:11 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆసియాలోనే తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసీల ఆరాధ్య దైవమైన వనదేవతల దర్శనానికి మూడవ రోజైన శుక్రవారం నాడు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. దర్శనం చేసుకుని నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. అలాగే చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నతాధికారులు కూడా వచ్చి వనదేవతలను దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఇప్పటికీ తాడ్వాయి నుండి మేడారం వరకు రహదారులన్నీ భక్తులు వచ్చిపోయేవాహనాలతో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేస్తున్నారు. భారీగా పోటెత్తిన భక్తజన సందోహం కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఆదివాసీల జాతర గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా అరణ్యంలో జరుగుతుంది. ఇప్పటికీ భక్తులు రాకపోకలు సాగిస్తున్న రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు వీఐపీలకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేసి అక్కడి నుండే వెళ్లి మొక్కులు చెల్లించుకుని మళ్ళీ అదే దారి నుండి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల నుండి మేడారంలో బస్సు చేసిన భక్తులు అమ్మవార్ల దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్నారు. శనివారంతో తిరిగి వనదేవతలు కన్నేపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమ్మక్క, అలాగే పగిడిగిద్ద రాజు కూడా వనప్రవేశాలు సాయంత్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్యగంటగంటకి పెరుగుతోంది. మంత్రి సీతక్క జాతర ఆరంభ నుండి అక్కడే ఉంటూ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేస్తున్నారు. మరోవైపు మేడారంలో ఏర్పాటు చేసిన చిరు దుకాణాల్లో వ్యాపారులు భక్తుల వద్ద నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. చాలామంది భక్తులు వారికి తెలియక ఏమి అవసరమైన సామాన్లు కూడా తీసుకువెళ్లకపోవడంతో అక్కడ దొరికే వస్తువులకు అన్నిటికీ రూపాయి విలువ చేసే వస్తువుకు పది రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బెల్లం బంగారాన్ని కూడా భారీగా భక్తులు కొనుగోలు చేస్తున్నారు. ఏది ఏమైనా భక్తులు చేసేది లేక కొనుక్కోనిది వెళ్ళదు కాబట్టి తీసుకోవడం జరుగుతుందన్నారు. బయటికి ఎటు వెళ్ళాలన్నా గంటల సమయం పడుతుందని అందుకోసం వెళ్లలేక తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైన వస్తువులన్నీ కొనుగోలు చేస్తున్నామని అన్నారు. సేఫ్టీ అధికారులు సైతం పలు హోటళ్లలో వంటనూనె, చిప్స్ పాకెట్లు, కూల్ డ్రింక్స్ తదితర వాటిని పరీక్షిస్తున్నారు. కాలం చెల్లిన వస్తువులను తీసుకెళ్తున్నారు. పోలీస్ యంత్రాంగం భారీ భద్రత నడుమ భక్తులు వనదేవతలను దర్శించుకొని మూడు రోజుల నుండి ఉన్నవాళ్లు ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతున్నారు. శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే మినీ మేడారం జాతరలలో కూడా నాకు వేల సంఖ్యలో భక్తుల ధరలు వచ్చి వనదేవతలను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: