Wednesday, 29 July 2026 10:14:03 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా..! అర్హుల వివరాలు ఇవే..

Date : 25 March 2026 09:56 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకo ఈ పథకానికి అర్హత సాధించాలంటే ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే లో నమోదై ఉండటం ప్రాథమిక నిబంధన లు ఇలా ఉన్నాయి.ఈ సర్వే ద్వారా గుర్తించిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికీ ఈ బీమా వర్తిస్తుంది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబ యజమానిగా నమోదైన వ్యక్తి మరణించిన సందర్భంలో, వారి నామినీకి లేదా కుటుంబ సభ్యులకు ఈ రూ. 5 లక్షల బీమా సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ప్రభుత్వం ఈ పథకం కోసం ఎటువంటి కొత్త దరఖాస్తులను కోరడం లేదు. సామాజిక-ఆర్థిక సర్వేలో భాగంగా సేకరించిన డాటా ఆధారంగానే లబ్ధిదారులను డిజిటల్ పద్ధతిలో గుర్తిస్తారు. ఎవరైనా సర్వేలో నమోదు కాని పక్షంలో, వారు తదుపరి విడతలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ బీమా కోసం అయ్యే ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది, కాబట్టి లబ్ధిదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా కేవలం మరణానంతర సాయమే కాకుండా, పేద కుటుంబాల్లోని మహిళలు, పిల్లల భవిష్యత్తుకు ఒక భరోసా లభిస్తుంది. ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి పైగా ప్రమాద బీమా కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు సామాన్యులకు కూడా రూ. 5 లక్షల పరిమితితో రక్షణ కల్పించడం దేశంలోనే ఒక విప్లవాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపకూ ఆర్థిక ధైర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :