ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి వద్ద వచ్చే ఏడాది 2027జూన్ లో నిర్వహించనున్న పుష్కరాలకు చేపడుతున్న ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లను సవి చూడడం జరుగుతుందన్నారు. అన్నారు ముఖ్యంగా గోదావరి వద్ద ఎక్కువ మంది భక్తులు పుణ్యా స్నానాలు ఆచరించేందుకు వస్తున్నట్లు గతంలో జరిగిన పుష్కరాల కంటే ఈసారి జరగనున్న పుష్కరాలకు ఎక్కువ మేరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకోసం గోదావరి పరిసర ప్రాంతాల్లో సుమారు 20 ఎకరాల వరకు పార్కింగ్ కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పనులు కూడా చేపట్టుకోనున్నట్లు అధికారులకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసిల్దార్ దిలీప్ కుమార్,మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కమిషనర్ విజయ్ కుమార్ లు ఉన్నారు.
Admin
E Nivas News