Wednesday, 29 July 2026 07:25:57 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

పురపాలక ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Date : 10 February 2026 06:30 PM Views : 174

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : నేడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మై దానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సి పల్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుండి అంబేద్కర్ స్టేడియంలోని బ్యాలెట్ బాక్స్ లు నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును పరిశీలించి అధి కారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ ఓట్లు లెక్కింపు కొరకు ఏర్పాటు చేయనున్న సింగరే ణి మినీ ఫంక్షన్స్ హాల్ ను పరిశీలించి కౌంటర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీలో 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఓటర్లు నిర్భయంగా రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును వినియోగించుకావాలని సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పిఓలు, ఏపీవోలు, ఓపివోలుకు ఎన్నికల నిబంధన ప్రకారం శిక్షణ ఇవ్వడంజరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల కు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోస్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్ విజయలక్ష్మి, ఆర్డిఓ హరి కృష్ణ, మున్సిపల్ కమి షనర్ జోనా తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపిడిఓ తరుణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :