ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : నేడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మై దానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సి పల్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుండి అంబేద్కర్ స్టేడియంలోని బ్యాలెట్ బాక్స్ లు నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును పరిశీలించి అధి కారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ ఓట్లు లెక్కింపు కొరకు ఏర్పాటు చేయనున్న సింగరే ణి మినీ ఫంక్షన్స్ హాల్ ను పరిశీలించి కౌంటర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీలో 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఓటర్లు నిర్భయంగా రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును వినియోగించుకావాలని సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పిఓలు, ఏపీవోలు, ఓపివోలుకు ఎన్నికల నిబంధన ప్రకారం శిక్షణ ఇవ్వడంజరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల కు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోస్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్ విజయలక్ష్మి, ఆర్డిఓ హరి కృష్ణ, మున్సిపల్ కమి షనర్ జోనా తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపిడిఓ తరుణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News