Wednesday, 29 July 2026 01:03:27 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

షహీద్ భగత్ సింగ్ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి...

మంచిర్యాల లో భగత్ సింగ్ సంస్మరణ సభ..

Date : 23 March 2026 10:03 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భరతమాత దాస్య విముక్తి కోసం పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలు సమస్యల సాధన కోసం ఉద్యమించాలని వివిధ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. షహీద్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవుల 95 వ అమరత్వ దినం సందర్భంగా సోమవారం మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. కుల మత సంకుచిత ధోరణులను అధిగమించిన నాటి వీరులు స్వాతంత్ర్య పోరాటంలో ఐక్యంగా పాల్గొన్నారని వారు తెలిపారు. నేటి కాలంలో ప్రజలు మత సామరస్యతను, జాతి సమైక్యతనుకాపాడాలని పిలుపునిచ్చారు. "సామ్రాజ్యవాద్ ముర్దాబాద్" అంటూ నేటికీ వందేళ్ల క్రితమే షహీద్ భగత్ సింగ్ నినదించాడని వారు తెలిపారు. ఆయా స్వతంత్ర దేశాలలోకి చొరబడి దేశాధినేతలను రాక్షసంగా హతమార్చే జులుంను ప్రదర్శిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే వారికి భగత్ సింగ్ స్ఫూర్తిగా నిలిచాడని వారు పేర్కొన్నారు. దేశంలోని సామాన్య ప్రజలకు ఆకలి, పీడనల నుండి విముక్తి లభించడమే నిజమైన స్వాతంత్ర్యమని షహీద్ భగత్ సింగ్ పేర్కొన్నాడని వారు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై పోరాడే వారికి తరగని స్ఫూర్తి ప్రదాతగా షహీద్ భగత్ సింగ్ నిలిచి ఉంటాడని తెలిపారు. భగత్ సింగ్ పుట్టిన గడ్డపై ఆయన ఆశయాలకు మరణం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షహీద్ భగత్ సింగ్ స్మారక సమితి కన్వీనర్ అలుగూరి కైలాసం, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు సంకె రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, బీమా ఉద్యోగుల సంఘం నాయకులు మోతే రామదాసు, ఏ తిరుపతిరెడ్డి, క్యాతం రవి, నేదునూరు కిరణ్, తూముల మల్లేష్, అన్నం రమేష్ కట్టా ప్రకాష్, కుక్కుడపు బాపు, గుమాస ప్రకాష్, వేముల అశోక్, తోట గౌరయ్య, ప్రేమ్ కుమార్, రవూఫ్ మిడివెల్లి రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :