Monday, 14 September 2026 03:34:55 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు..

Date : 13 February 2026 09:16 AM Views : 198

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనపై ప్రెస్‌నోట్‌లో వివరణ జగ్గారెడ్డి ఇచ్చారు . బుధవారం సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుడిని సీఐ గల్లా పట్టుకొని ఈడ్చుకొచ్చి కొట్టారని తెలిపారు. తన పార్టీ నాయకుడిని రక్షించుకోవడానికి బూత్‌కు వెళ్లి సీఐని తిట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతుగా సీఐ తమ పార్టీ నాయకుడిని అవమానించారని తెలిపారు. కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతినేట్లు చేసిన సీఐని తిట్టడం జరిగిందని జగ్గారెడ్డి వివరించారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని కానీ పది మంది మధ్యలో తమ పార్టీ నాయకుడికి సీఐ చేసిన అవమానం పోగొట్టడానికి బూత్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. ఎన్నికల నిబంధనలను సీఐ లేదా తాను ఉల్లంఘించినా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అందరూ దానిని స్వాగతించాలని అన్నారు. న్యాయస్థానంలో ఎవరి తప్పు, ఎవరి ఒప్పు తేలుతుందని పేర్కొన్నారు. ఈ సంఘటనను నిన్న సాయంత్రం 5 గంటలకే వదిలేశానని చెప్పారు. మరోవైపు, బుధవారం సంగారెడ్డిలో జరిగిన సంఘటనను కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తిప్పారని మండిపడ్డారు. అధికారులపై జగ్గారెడ్డి దాడి చేస్తున్నారంటూ పదేపదే ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ‘గతంలో కేటీఆర్ ఒక పోలీసు అధికారిని బూతు పదజాలంతో తిట్టారన్నారు. తెలంగాణ పోలీసులను తన్ని, తిట్టి, ఆంధ్రోళ్లకు పుట్టారా' అంటూ హరీశ్ రావు నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుగా కేటీఆర్, హరీశ్ రావు తిట్టిన విషయాలకు సమాధానం చెప్పి, ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :