ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఈ నెల 18 న నిర్వహించనున్న బిసి బంద్ ను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలమున్నూరు కాపు సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గాండ్ల సత్యనారాయణ, జాబు సుగుణాకర్ , కోశాధికారి చీట్ల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని తీర్మానం చేసి గవర్నర్ కు పంపి ఆరు నెలలు అయినా స్పందన లేదన్నారు. బిసి రిజర్వేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వండి జరిగిందని,దానిని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తే అక్కడ కూడా కొట్టివేయడం సరైంది కాదన్నారు. బిసిలకు రిజర్వేషన్ ఇవ్వడం ఏ పార్టీలకు ఇష్టం లేదని విమర్శించారు. బిసి సబ్బండ వర్గాలు ఐక్యంగా ఉండి రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Admin
E Nivas News