ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ శివారులో హృదయ విదారక ఘటనచోటుచేసుకుంది. చర్లపల్లి – ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2. 30 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.రైల్వే ట్రాక్పై మృతదేహాలను గుర్తించిన గూడ్స్ రైలు లోకో పైలట్ వెంటనే వాకీటాకీ ద్వారా అధికారులకు సమాచారంఅందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి (38), ఆమె కూతురు చేతన రెడ్డి (ఇంటర్ సెకండ్ ఇయర్), కొడుకు విశాల్ రెడ్డి (ఇంటర్ ఫస్ట్ ఇయర్)గా గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం విజయశాంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటుండగా, ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Admin
E Nivas News