ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ గదులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని వైద్య అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో లేవని ఎంపీ దృష్టికి రావడంతో, ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో తనకు పరిచయమైన డ్రైవర్ శంకర్ తల్లి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీ ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఎంపీ వెంట నాయకులు అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News