Sunday, 13 September 2026 11:17:43 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ర్యాగింగ్‌ భూతం నుండి విద్యార్థుల భద్రతకి అత్యంత ప్రాధాన్యత..

సిపి. అంబర్ కిషోర్ ఝా

Date : 14 November 2025 06:50 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ర్యాగింగ్ భూతం నుండి విద్యార్థులకు అత్యంత భద్రత కల్పిస్తామని రామగుండం సిపి తెలిపారు. మెడికల్ కళాశాల లో ర్యాగింగ్‌ అనే ఆలోచన విద్యార్థులలో లేకుండా పూర్తిగా నిరోధించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖని లోని సింగరేణి మెడికల్ కళాశాలలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, పెద్దపల్లి జోన్ షీ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య సాన్నిహిత్యం, ఒకరిపై ఒకరు గౌరవం, ర్యాగింగ్ వల్ల తీసుకొనే చట్టపరమైన చర్యలు, శిక్షలు, ర్యాగింగ్ కి పాల్పడడం వలన కలిగే వ్యక్తిగత హానికర పరిణామాల గురించి, బాధితులకు అందుబాటులో ఉన్న పోలీస్ హెల్ప్‌లైన్ సేవల గురించి అవగాహన కల్పించడం జరిగింది. గోదావరిఖని ఎసీపీ రమేష్ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లకు సహాయం చేయాలి, మార్గనిర్దేశనం ఇవ్వాలి, ప్రోత్సహించాలి ,బాధ పెట్టరాదు.క్రమశిక్షణ, మంచి సత్ససంబంధాలు, పరస్పర గౌరవం, ఎలాంటి భయలు లేకుండా, సురక్షితమైన వాతావరణంలో అందరూ కలిసి ఉండాలని ఎసీపీ రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ర్యాగింగ్ కి పాల్పడడం అనేది ఏ రూపంలోనైనా నేరం. ర్యాగింగ్ కి పాల్పడితే కేసులు నమోదు చేసి, జైలుశిక్ష, కళాశాల నుండి సస్పెన్షన్,తొలగింపు వరకూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సీపీ అన్నారు. మీ తల్లితండ్రులు మీపై పెట్టుకొన్న ఆశలు, కన్నా కలలు, మీరు ఎంచుకొన్న లక్ష్యాలు అర్ధతరంగా ముగిసిపోయి మీ భవిష్యత్తు నాశనం అవుతుంది అని తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే ఆత్మస్థైర్యం కోల్పోవడం, తరగతులకు రావడానికి భయపడడం, మానసికంగా కృంగిపోయి బాధపడకుండా ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా వెంటనే పోలీసులకు,యాంటీ ర్యాగింగ్ కమిటీకి సమాచారం ఇవ్వాలి అని సూచించారు. దేవుని ప్రార్థిస్తే వరాలు ఇస్తాడో లేడో కానీ, *"వైద్యో నారాయణ హరి"* అంటే వైద్యులు నారాయణునితో (దేవునితో) సమానమని అర్థం. ఈ సూక్తి వైద్య వృత్తి యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, మరియు వైద్యులు మానవ జీవితాన్ని రక్షించే దైవంతో సమానమని అందరి నమ్మకం కాబట్టి ఏలాంటి డ్రగ్స్ లకు అలవాటు పడడం కానీ, ర్యాగింగ్ పేరుతో ఇతరులని మానసికంగా బాధ పెట్టడం కానీ, ఇతరులు ఇబ్బంది పడేలాగా చేయడం గానీ, గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఏలాంటి ప్రమాదం పొంచి ఉన్నదనేది మీకు బాగా తెలుసు, అలాంటి వాటికి ఎవరైనా మీ తోటి వారు ఆకర్షితులు కాకుండా బంగారు భవిష్యత్తుకు బాటలకు వేసుకొవాలి అని తెలిపారు.క్యాంపస్‌ మొత్తం సీసీ కెమెరాలతో నిఘా ఉందని, క్యాంపస్ చుట్టూ పోలీస్ ప్యాట్రోలింగ్, ప్రత్యేక నిఘా కొనసాగుతుంది అని పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యత అని ర్యాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు–కళాశాల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు డ్రగ్స్ దుర్వినియోగం, ముఖ్యంగా గంజాయి వినియోగం వల్ల కలిగే సమస్యలు, చట్టపరమైన శిక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గంజాయి వినియోగం, నిల్వ, రవాణా, విక్రయం కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు . సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో అకౌంట్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింక్స్, ఫిషింగ్ వంటి ఘటనలపై జాగ్రత్తలు పాటించాలి అని , అనుమానాస్పద వెబ్‌సైట్లు, లింకులు మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెస్సేజ్ క్లిక్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 సైబర్ హెల్ప్‌లైన్ ను సంప్రదించవచ్చని సూచించారు .విద్యార్థులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, డ్రగ్స్ మరియు సైబర్ ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలని, సమాజంలో అవగాహన పెంచడంలో భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి నాగేంద్ర గౌడ్ , మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ , గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సునీత, ఎన్. జి ఓ, ఎస్సై అనూష, పెద్దపల్లి జోన్ షీ టీమ్ ఇన్చార్జి ఎస్ ఐ లావణ్య, షీ టీమ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మెడికల్ కళాశాల ప్రొఫెసర్స్, విద్యార్థులు 500 మంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :