ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త తెలిపింది. త్వరలో ప్రయాణికుల రద్దీ కష్టాలు తీరిపోనున్నాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద టీజీఎస్ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం మరో 200 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్ని కేటాయించింది. ఈ బస్సుల్ని త్వరగా ఆర్టీసీకి సరఫరా చేసే సంస్థను ఎంపిక చేసేందుకు టెండర్ల ప్రక్రియను సైతం ప్రారంభించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నడపనున్నారు. ఈ బస్సులను తయారీ సంస్థల నుంచి ఆర్టీసీ అద్దె పద్ధతిలో తీసుకుంటుందని అధికారులు చెప్పారు.
Admin
E Nivas News