ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు డీజిల్ అయిపోవడంతో ఆగిపోయిన సంఘటన చోటు చేసుకుంది. దాదాపు గంట వరకు బస్సు ఆగిపోవడంతో దాంట్లో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు సమయం సాయంత్రం 5గంటలకు డీజిల్ అయిపోవడంతో ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ ముత్యంపేట వద్ద గల పెట్రోల్ బంకు కు వెళ్లి డీజిల్ తీసుకువచ్చి బస్సులో డీజిల్ పోసి తీసుకెళ్లాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు లో డీజిల్ అయిపోవడంతో పలువురు ప్రయాణికులు పలు రకాలుగా చర్చించుకున్నారు.
Admin
E Nivas News