ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ నేరాల నియంత్రణకు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సెప్టెంబర్ నెల నేర సమీక్షలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో కమిషనరేట్లో సిపి బుధవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించి కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పొలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేసుల పరిష్కార శాతం పెంచాలి, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ( యు ఐ & పి టి) కేసుల త్వరతగతిగన పరిష్కారించాలి. కేసుల దర్యాప్తులో విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలి. గతం లో నమోదైన పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు పారదర్శకంగా నిర్వహించి వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీకేసు లలో, పోక్సో కేసు లలో బాధితులకు కంపన్సేషన్ త్వరగా అందేలా చూడాలి. కన్వెక్షన్ శాతాన్ని పెంచాలన్నారు.మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళలు, బాలికల, మైనర్ బాలుర మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలి, మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాపర్టీ నేరాల ప్రత్యేక దృష్టి సారించి నేరాల నియంత్రణ కు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. నిందితుల పట్టుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టీమ్స్ ఏర్పాటు చేయాలి.ప్రతి రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధగంట సమయం ప్రధాన చౌరస్తా, గ్రామాల వారిగా రోడ్ పై విషబుల్ గా ఉండాలి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం వలన మీ మీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ప్రసెన్స్ కనిపిస్తుంది. మీ గుర్తింపు, పోలీస్ శాఖ కీర్తి పెరుగుతుంది. ప్రజలకు పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నది అనే నమ్మకం, భరోసా కలుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదలలో ఎక్కువ శాతం యువత చనిపోవడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో కల్సి పనిచేయాలని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలి. రోడ్ సేఫ్టీ వాలింటర్స్ ను తయారు చేయాలి అని ఆదేశించారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ అనేది ఒక పెద్ద సమస్య. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం అవసరమని తెలిపారు. సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం బాధితులకు సకాలంలో సహాయం అందేలా చూడాలని సూచించారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని గంజాయి నియంత్రణ కు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేయాలి. గంజాయి, డ్రగ్స్ వంటి నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. అదేవిదంగా చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రతిష్ట కు భంగం కలిగించే విధంగా విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని శాఖ పరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ అధికారుల పనితీరుపైనే రామగుండము పోలీస్ కమిషనరేట్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి వుంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఎ .భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, సీసీ పిఎస్ ఏసీపీ రంగా రెడ్డి, సిసియస్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, కమీషనరేట్ పరిది ఇన్స్స్పెక్టర్లు, ఎస్.ఐలు సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News