ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మ వారి దీవెనలు అందరిపై ఉండేలా చూడాలని కోరుతూపెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరిగిందని ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు చీకటి తిరుపతి తెలిపారు . మంచిర్యాల జిల్లా లక్షట్ పేట పట్టణంలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గోదావరి రోడ్డు లోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద మహిళ భక్తులు ప్రత్యేక బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చీకటి తిరుపతి మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని కోరుతూ వర్షాకాలం ప్రారంభం ముందు అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలకరి జల్లుల పలకరింపుతో రైతులు పొలాల పనుల్లో నిమగ్నయ్యే క్రమంలో సర్వ జీవ కోట్ల క్షేమాన్ని కోరుతూ ప్రత్యేక మొక్కులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా వర్షాలు సంవృద్దిగా కురువాలనిమొక్కుకున్నట్లు తెలిపారు. అంతకుముందు యాట పిల్లలతో డప్పు చప్పుల్ల మధ్య బోనాలతో పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో. గడ్డం కొమరయ్య. చీకటి వెంకటేష్. కంకణల రాజు శిరవేణి శంకర్. ఐతర వేణి లచ్చున్న చీకటి సతీష్ . కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News