ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం అండర్ 17 విభాగంలో అథ్లెటిక్ క్రీడలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల ద్వారా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రీడల్లో చురుకుగా పాల్గొన్నట్లయితే వారికి ఇష్టమైన క్రీడను తన లక్ష్యం వేయించుకొని భవిష్యత్తును తెలుసుకో తీర్చిదిద్దుకోవచ్చన్నారు. అనంతరం మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల ఆర్ సి ఓ షేరు శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాల కళాశాలలో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు అన్ని రకాల క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తారన్నారు. అనంతరం మండల విద్యాధికారి శైలజ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు అన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను శ్రద్ధగా విని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. అనంతరం అథ్లెటిక్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ అథ్లెటిక్ పోటీలలో జిల్లాలోని 12 గురుకుల పాఠశాలలు చెందిన దాదాపు 400 మంది విద్య క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మంగ, ఏటీపీ తిరుమల్, డి డబ్ల్యు వాణి ఆయా పాఠశాల కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులుపాల్గొన్నారు.
Admin
E Nivas News