ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సిద్దిపేట పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి వినియోగాన్ని మరియు రవాణాను పూర్తిగా అరికట్టే చర్యల్లో భాగంగా సిద్దిపేట టూ టౌన్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో టూ టౌన్ పోలీసులు కెసిఆర్ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గుండ్ల చెరువు సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైం దన్నారు. నిందితుల వివరాలు ఇలా ఉన్నాయన్నారు. కోడూరు సురేష్ ఆగుళ్ళ ఎల్లేష్ సిద్దిపేట. కు చెందిన వారన్నారు. వారి వద్ద 26 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి, వారిపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడినా లేదా సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఉపేందర్ హెచ్చరించారు.
Admin
E Nivas News