ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : అర్హులైన పాత్రికేలందరికీ ప్రభుత్వని బంధన ప్రకారం అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని,జిల్లా కలెక్టర్.మరియు జి ల్లామీడియా అక్రిడేషన్ క మిటీ చైర్మన్ రాహుల్ శర్మ అన్నారు.శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా అక్రిడి టేషన్ కమిటీ సభ్యులు కలె క్టర్ను కలిసి మొక్కను అం దజేశారు. ఈసందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ,ప్రజలకు ప్రభుత్వం మధ్య సమాచార వారధులుగా పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తారని, జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని సూచించారు.అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 2026–2028.సంవత్సరాలకు చెల్లుబాటు అయ్యే అక్రిడి టేషన్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన జర్నలిస్టు లకు కార్డులు జారీ చేయా లనిఅన్నారు. ఈసందర్భంగా డీపీఆర్వో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియపై వివరాలు వెల్లడిం చారు.దరఖాస్తుల పరిశీలన లో సంస్థ గుర్తింపు పత్రం,వి ద్యార్హతలు తదితర అంశా లను సమగ్రంగా పరిశీలిం చాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు మీడి యా ప్రతినిధుల నుంచి 33 0.ఆన్లైన్ ధరఖాస్తులు అందాయని,వాటిని ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం పరిశీలిం చాలని,డీపీఆర్వోను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాం క్ సింగ్,అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,డీపీఆర్వో శీలం శ్రీనివాస్,అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు క్యాతం సతీష్ కుమార్,మంతెన స మ్మయ్య,ఎర్రం సతీష్ కు మార్,మోబిన్ అహ్మద్,జి. సారేశ్వరరావు,పాలకుర్తి మ ధు,తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News