ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట స్వామి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్ఎస్ యు ఐ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ఎస్ యు ఐ నాయకులు, విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి రాజకీయాలు భవిష్యత్తు నాయకత్వానికి పునాది అని పేర్కొన్నారు. రాజకీయంగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో ఎదిగిన అనేక మంది నాయకులు ఎన్ ఎస్ యు ఐ నుంచే ఎదిగారని ఆయన గుర్తు చేశారు. నిత్యం ప్రజల్లో ఉండడం ద్వారా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు. ఓపిక, సహనం కలిగి క్రమంగా ముందుకు సాగాలని, విద్యార్థి రాజకీయాల్లో బాధ్యతతో వ్యవహరించడం అలవర్చుకోవాలని యువ నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సిడబ్ల్యుసి సభ్యుడు వంశీ చంద్ రెడ్డి , ఎంపీ అనిల్ యాదవ్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు .
Admin
E Nivas News