ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానెరడిగొండ మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాలు దాంశ్య తాండ, సుర్థపూర్, రెంగన్ వాడి గ్రామాల్లో మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బైకుపై సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యే పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మా సమస్యల కొరకు సుడిగాలి పర్యటనగా వచ్చి మాకు ధైర్యం చెప్పడం మా అదృష్టమన్నారు. రెంగన్ వాడి గ్రామంలో నూతనంగా నిర్మించిన బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి కనీస రోడ్డు సౌకర్యాలు లేకుండా ఇబ్బందులుఎదుర్కొంటున్న గ్రామాలను ఆకస్మికంగాపర్యటించి పరిశీలించాలని బైకుపై పర్యటనలుప్రారంభించడం జరిగిందన్నారు. కచ్చితంగా రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేయించడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. పర్యటించిన ప్రతీ గ్రామ బాధను విన్నానని నేను ఉన్నానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.
Admin
E Nivas News