Tuesday, 28 July 2026 08:28:17 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే ...

Date : 29 June 2026 09:41 PM Views : 57

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎస్ ఐ ఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం బెల్లంపల్లి పట్టణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రక్రియ లక్ష్యం అని, ఎన్నికల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. సోమవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 31వ, 33వ వార్డుల్లో నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఏలు, బీఎల్వోలతో కలిసి ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, అవసరమైన పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతో సమన్వయంతో పనిచేయాలని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్ బాబు , మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి , బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు, బండి ప్రభాకర్ , కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బి ఎల్ ఏ లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: