ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎస్ ఐ ఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం బెల్లంపల్లి పట్టణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రక్రియ లక్ష్యం అని, ఎన్నికల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. సోమవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 31వ, 33వ వార్డుల్లో నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఏలు, బీఎల్వోలతో కలిసి ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, అవసరమైన పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతో సమన్వయంతో పనిచేయాలని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్ బాబు , మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి , బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు, బండి ప్రభాకర్ , కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బి ఎల్ ఏ లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News