Friday, 11 September 2026 08:16:29 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

భూ సేకరణలో పరిహారం చెల్లింపు ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి...

రాష్ట్ర నీటిపారుదల, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..

Date : 25 August 2026 09:37 PM Views : 83

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూ సేకరణలో పరిహారం చెల్లింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు . మంగళవారం హైదరాబాద్ నుండి నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో భూసేకరణ, పునరావాసం–పునరావాస పునరుద్ధరణ, అటవీ అనుమతులు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణ పరిహారం చెల్లింపులకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హతలను పరిశీలించి జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. అర్హత కలిగిన భూ నిర్వాసితులకు,భూ యజమానులకు పరిహారం చెల్లింపుల ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని, ఇంజనీర్ లు సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతంగా పని చేయాలని తెలిపారు. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసం సుమారు 6 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నందున, అర్హత కలిగిన కేసులను గుర్తించి, అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రతి కేసుకు టోకెన్ నంబర్ జనరేట్ చేసి, చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. భూసేకరణ పరిహారం చెల్లింపులు, అర్హత నిర్ధారణ, ఇతర సాంకేతిక,పరిపాలనా సమస్యలు ఎదురైన పక్షంలో సంబంధిత అధికారులు ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని, పి.డి. ఖాతాలో ఉన్న నిధులను వెంటనే భూ యజమానులకు చెల్లింపులు చేయాలని తెలిపారు. భూసేకరణ, ఆర్ & ఆర్, అటవీ భూములకు సంబంధించిన పెండింగ్ అంశాలను నిర్దేశిత కాలవ్యవధిలో పరిష్కరించి అభివృద్ధి ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా భూసేకరణ పురోగతి, పరిహారం చెల్లింపులు, ఆర్ & ఆర్ చర్యలు, అటవీ భూములకు సంబంధించిన అనుమతులు, పెండింగ్ సమస్యపై సమీక్షించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో భాగంగా సేకరించిన భూముల యజమానులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించడం, అటవీ శాఖ సంబంధిత అనుమతుల పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, భూ సేకరణ, నీటిపారుదల శాఖల అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: