Tuesday, 28 July 2026 11:01:29 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

30 ఏండ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి అవగాహన ఉంది. *వామన్ రావు హత్యకేసులో ఎవరు తమను ప్రోత్సహించలేదు

మంథనిలో విలేకరుల సమావేశంలో వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు

Date : 18 November 2025 06:00 PM Views : 258

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు-నాగమని దంపతుల హత్యకేసులో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తమను ప్రోత్సహిస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించడం నిజం కాదని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు అన్నారు. మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ నేను గత 30 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని, నాకు న్యాయ వ్యవస్థ పై పూర్తి అవగాహన ఉందని, తన కొడుకు, కోడలును హత్య చేసిన నిందితులను న్యాయపరంగా శిక్షించాలని, వృద్ధ వయసులో తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నిందితులకు శిక్ష పడాలని మొదటి నుంచి పోరాడుతున్నానని, న్యాయం వ్యవస్థ పై తమకు నమ్మకం ఉంది కాబట్టే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లి తమ లాయర్లు మేనక గురుస్వామి, భరత్ కుమార్, చంద్రకాంత్ రెడ్డిల సహకారంతో ఈ కేసును సుప్రీం కోర్టు లో వాదించడంతో సుప్రీం కోర్టు సిబిఐ కి అప్పగించిందని, ఈ కేసులో నాకు ఏం తెలవదని శ్రీధర్ బాబు అండదండలతో నేను సుప్రీంకోర్టుకు వెళ్లాలని పుట్ట మధు ఆరోపించడం శ్రీధర్ బాబు పై బురద చల్లడమేనన్నారు. ఈ కేసుతో పుట్ట మధుకు, ఆయన భార్యకు, సంబంధం లేదని ఆరోపిస్తున్నారని, పుట్ట మధుకు ఈ హత్యతో సంబంధం లేకుంటే తమ కుటుంబాన్ని ఒక్కసారైనా పుట్ట మధు వచ్చి పరామర్శించారా.. అని వామన్ రావు తమ్ముడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు వద్ద పుట్ట మధు తన తండ్రి కలిసి ఉండేవారన్నారు. ఇకమీదట ఈ కేసులో సంబంధం లేని వారిని విమర్శిస్తే న్యాయపరంగా పోరాడుతామన్నారు. న్యాయ వ్యవస్థ పై తమ కుటుంబానికి నమ్మకం ఉందని తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా, తన కొడుకును, కోడలును పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితులకు సుప్రీంకోర్టులో శిక్ష పడే వరకు ఇలాగే పోరాడుతామని వారు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :