ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలం బయ్యారం గ్రామానికి చెందిన పసుల భానుప్రసాద్. పాడి గేద కరెంట్ షాక్కు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసు కుంది. మేతకు వెళ్లిన గేద వాగులో నీరు తాగేందుకు వెళ్లిన సమయంలో కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపారు. మృతి చెందిన పాడి గేద విలువ సుమారు రూ. 55 వేల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నారు. ఈ ఘటనతో తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని వాపోయారు. ఈఘటనపై సంబంధిత అధికారులు పరిశీలించి, ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని బాధితుడు కోరారు.
Admin
E Nivas News