ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలను నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. రోడ్లు–భవనాల శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు . ఎన్ హెచ్ లకు రింగు రోడ్ల అనుసంధానం,హైదరాబాద్ -విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలన్నారు. సీఎం వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
Admin
E Nivas News