Monday, 14 September 2026 12:01:14 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం..

తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్

Date : 25 April 2026 05:44 AM Views : 185

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవకతవకలు జరిగినాయనేది పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ ప్రేరేపిత అభియోగాలని రుజువైంది. కేసీఆర్ మీద కమిషన్ పేరుతో వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడ హై కోర్టు ముందు చెల్ల లేదన్నారు. జస్టిస్ పి సి ఘోష్ కమిషన్, కేసీఆర్ కాళేశ్వరం విచారణ పేరుతో వ్యవహరించిన తీరు, ప్రాథమిక న్యాయ సూత్రాలకు, రాజ్యాంగపర హక్కులకు విరుద్ధమని న్యాయస్థానం తెలంగాణ సహకార సంఘం మాజీ చైర్మన్ రాజా వరప్రసాదరావు స్పష్టం చేసిందన్నారు. కమిషన్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కుదరదు అని బల్లగుద్ది చెప్పడం జరిగిందన్నారు. హై కోర్టు వెలువరించిన తీర్పు తాత్పర్యం ఏమిటంటే.. సాక్షులుగా పిలిచిన ( కేసీఆర్ తదితరులు) వారి మీద చర్యలు చేపట్టడం కుదరదని చర్యలు తీసుకోవాలని అనుకుంటే వారికి ముందస్తు నోటీసులు ఇవ్వడంతోపాటు వారి వాదనలుకూడా వి నాలన్నారు. అటువంటివి ఏమీ లేకుండా సాక్షులుగా పిలిచిన వారిని విచారణ పేరుతో అగౌరవ పరుస్తూ, ఏకపక్షంగా ఉద్దేశాలు ఆపాదిస్తూ, తప్పు పడుతూ, తలకాయ తోక లేకుండా వ్యవహరించడం తప్పు కాదా అని విమర్శించారు. చట్టం న్యాయ వ్యవస్థ పట్ల కనీస అవగాహన లేని కమిషన్ నివేదిక తప్పుల తడక అన్నారు. అటువంటి అసంబద్ధమైన పి సి ఘోష్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్రమే కానీ, సి బి ఐ ఇంకెవరైనా కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదన్నారు. హై కోర్టు ధర్మాసనం తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ చెంపలు పగలగొట్టే తీర్పునివ్వడం గమనార్హం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయ ప్రేరేపిత ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వంపై మచ్చ వేయాలనే ఉద్దేశంతో కమిషన్‌ను ఉపయోగించిన విధానం ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసిం దన్నారు. కమిషన్ విచారణ ప్రక్రియ ఏకపక్షంగా సాగిందని, సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడంవారి వాదనలు వినకపోవడం వంటి లోపాల వల్ల ఆ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కుదరదని కోర్టు తేల్చిచెప్పిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రతిష్టాత్మక నిర్మాణం అన్నారు. ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలనే ప్రయత్నాల మధ్య వచ్చిన ఈ తీర్పు కేసీఆర్ , హరీశ్ రావుల పై చేసిన ఆరోపణలు తప్పుడువి అనే తేల్చిందన్నారు. ఈ తీర్పును గౌరవిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అనవసర రాజకీయ ఆరోపణలను విరమించుకోవాలని తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కాలేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. తెలంగాణ వ్యవసాయానికి సాగునీటిని అందించాలి రైతాంగం సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా మరణం చేయాలని చూసినా చివరికి ఎన్నటికైనా ధర్మం గెలుస్తుందన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: