ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 21న మాజీ మంత్రి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ తెలిపారు. ఆదివారం మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విజిత్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 21 న మంచిర్యాలలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంటుంది అని తెలియజేశారు. లక్షెట్టిపేట మండలంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో రైతు సదస్సు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షెట్టిపేట మండలంలో మృతి చెందిన నలుగురి రైతుల కుటుంబాలకు 20 లక్షలు బిఆర్ఎస్ పార్టీ తరఫున అందజేస్తారని తెలిపారు.అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో అధికారులు మరియు ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పై తప్పుడు లెక్కలు చూపెడుతున్నారన్నారు. లక్షెట్టిపేట మండలంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో రైతు సదస్సు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేషన్ పత్రాలు 100% పంపిణీ చేశాం అనడం పూర్తిగా అబద్ధమని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరపై అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని కోరారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని,వారు వారి ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది అని అన్నారు.ప్రత్యేకg సమగ్ర సవరణ(సర్) పై ఎంతవరకు అయ్యిందో నిజాలు బయటపెట్టాలని అధికారులను కోరడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News