ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు మంథని మండలం ఎక్లాపూర్ ZPHS పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని నారమల్ల రజిత ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి తెలిపారు. 46 - 48 కేజీల అమ్మాయిల విభాగంలో రజిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి పోటీలలో బంగారు పథకం సాధించి హనుమకొండలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల పిడి డాక్టర్ రవి దొమ్మటి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న నారమల్ల రజితను ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, ఎస్ఎంసి చైర్మన్ లు అభినందించారు.
Admin
E Nivas News