ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యిందని, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగా లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ పేర్కొన్నారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాందేని తిరుపతి తన అనుచరులతో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంస్ మాజీ ఛైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ఓరుగంటి శ్రీకాంత్, మెట్టు కళ్యాణి, రాజు, నాయకులు గడిగొప్పుల సతీష్, మరిశెట్టి సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News