ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని 39వ డివిజన్ మున్సిపాలిటీ 17వ వార్డుమాజీ కౌన్సిలర్ పూదరి సునీత- ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొని విజేతలకు బహుమతులను మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ముగ్గుల పోటీలు నిర్వహించిన మాజీ కౌన్సిలర్ పూదరి సునీత- ప్రభాకర్ కు మరియు పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. ముందుగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ముగ్గుల పోటీలు పాల్గొన్న మహిళలు చాలా అందంగా రకరకాల ముగ్గులు వేసుకున్నారని అవి ఎంతగా నాకట్టుకున్నాయని అన్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మహిళలందరికీ ముగ్గుల పోటులే ఉంటాయని నేపథ్యంలో వారు మరిన్ని రకరకాల రంగవల్లికలు వేయడానికి సిద్ధంగా ఉండడం సహజమన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News