ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : యువత మద్యం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రకృతి పర్యావరణ సంస్థ నిర్వాహకులు సూచించారు. గురువారం మంథని అంబేడ్కర్ చౌక్ లో ప్రచార రథం ద్వారా కళాకారుల బృందంచే పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ రెస్పాండ్ ఆఫీసర్ స్వర్ణలత మాట్లాడుతూ మద్యపానం ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని అనారోగ్యాల బారిన పడడంతో పాటు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. మద్యపానానికి, మత్తు పదార్థాలకు బానిసలు అయిన వారు ప్రకృతి పర్యావరణం సంస్థ గోదావరిఖనిలో నిర్వహించే మాదకద్రవ్యాల విముక్తి కేంద్రానికి రావాలని కోరారు. మా సంస్థలో ఉచిత చికిత్స కౌన్సిలింగ్ యోగ వ్యాయామం ఉంటాయని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేవరకు పౌష్టికాహారంతో కూడిన వసతి కల్పిస్తామన్నారు. మత్తుపదర్థాలకు అలవాటైన వారు విముక్తి సెంటర్ 96768 80444, 79815 14516 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఎన్విరాల్మెంట్ సొసైటీ ప్రతినిధులు మౌనిక, హరిత కళాకారుల బృందం ఢిల్లీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News