Monday, 14 September 2026 06:32:17 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులుసిలివేరు అనిల్

Date : 01 November 2025 11:21 AM Views : 299

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే అనేకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి చూస్తూ ఓర్చుకోలేక కడుపు మంటతో ఎక్కడ వారి మనగడ పోతుందోనని భయంతో రోడ్లపైకి వచ్చి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులపై స్థానిక ఎమ్మెల్యే పై మండల నాయకులపై, అసత్యపు ప్రచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులుసిలివేరు అనిల్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మార్లు బస్సు చార్జీల పెంపు, కరెంటు చార్జీల పెంపు, గ్యాస్ ధరల పెంపుతో పేద ప్రజల మీద అధిక భారం మోపిందని, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని ప్రజలు గమనిస్తున్నారని సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, కొత్త రేషన్ కార్డులు, 10 లక్షల ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇంతకంటే ఎక్కువ సహాయం ఏ ప్రభుత్వం చేస్తుందో మీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. 20 నెలల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరూపించగలరా. 2014 నుండి 2023 వరకు పదేళ్లలో టిఆర్ఎస్ పాలనలో మేనిఫెస్టోలో పెట్టి ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకివ్వలేదన్నారు. దళిత బంధు, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు కేజీ టు పీజీ ఉచిత విద్యలాంటి హామీలను నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజలపై 8 లక్షల కోట్ల భారం మోపి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కెసిఆర్, బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ గురించి మాట్లడటం గమనార్హమన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :