ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పిడిఎస్ యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ డిగ్రీ కళాశాలలో పిడిఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థుల సభ్యత్వం నిర్వహించి డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫీజులు నేటితో ముగించడంతో మిగతా విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉందన్నారు. తక్షణమే డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పొడిగించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా నాయకులు కే. కార్తీక్, అజయ్, ఆంజనేయులు, విజయ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News