ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన కోడి నరేష్ (33) అనే యువకుడు శనివారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నాడు. గత రెండు నెలల నుండి భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో మృతుడు తన తల్లి వద్దంటున్నాడు. మృతుని భార్య తన కుమారుని తీసుకొని లక్చెట్టిపేటలో ఉంటుంది. మృతుని భార్య కాపురానికి రాకపోవడంతో మద్యానికి అలవాటు పడ్డాడు. తరచూ మద్యం తాగి వచ్చి తల్లితో తన భార్య కాపురానికి రావడం లేదనీ, వాళ్ళు పోవడంతో నాకు బ్రతకాలని లేదంటూ బాధపడితే తల్లి ఓదార్చేది. అదే గ్రామంలో నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చి బాధపడుతూ ఇంటి కి కొద్ది దూరంలో ఉన్న వావి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడన్నారు. మృతుని తల్లి కోడి బుచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Admin
E Nivas News