Tuesday, 28 July 2026 07:59:08 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి...

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 27 February 2026 07:41 AM Views : 142

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా,డి.సి.పి.ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు లతో కలిసి గోదావరి  పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ, పోలీస్,రెవెన్యూ, వైద్య, విద్యుత్, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభమేళా తరహాలో ఉంటాయని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గోదావరి నది పరివాహకంలో అనువైన ప్రాంతాలలో పుష్కరాల ఏర్పాట్ల కొరకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి కార్యచరణ సిద్ధం చేయాలని తెలిపారు. అధిక సంఖ్యలో మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరంలో పుష్కర స్నానాలు ఆచరిస్తారని, తరువాత గూడెంలో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్థానాలకు హాజరవుతారని తెలిపారు. పార్కింగ్, హోల్డింగ్ ఏరియా,పండల్ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రజా రవాణా వ్యవస్థ, డ్రోన్ ద్వారా పర్యవేక్షణ, పుష్కర ఘాట్ ప్రాంతాలలో లైటింగ్, త్రాగునీటి ఏర్పాట్లపై  ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని, ఈ విషయమై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమీక్ష ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రతిపాదనలు, కార్యచరణ సిద్ధం చేసి అందించాలని తెలిపారు. పుష్కరాలలో భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని,ఈ క్రమంలో మంచిర్యాలలో 2 లక్షల మంది, వేలాలలో 50 వేల మంది, చెన్నూరు ప్రాంతంలో సైతం అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. నీటిపారుదల శాఖ నివేదిక ఆధారంగా నూతన ఘాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వెలుతురు, పారిశుద్ధ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కార్యచరణ రూపొందించాలని తెలిపారు. భక్తుల సంరక్షణ దిశగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో పుష్కర స్నానాల ప్రాంతాలలో గజా ఈతగాళ్లను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని, పుష్కరాల నిర్వహణ కొరకు నోడల్ అధికారులను నియమించడం జరుగుతుందని తెలిపారు.కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉందని, కార్యచరణ రూపొందించడంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యచరణ రూపొందించాలని, పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తదనగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.పుష్కర ఘాట్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :