Monday, 02 March 2026 03:23:24 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి...

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 27 February 2026 07:41 AM Views : 42

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా,డి.సి.పి.ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు లతో కలిసి గోదావరి  పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ, పోలీస్,రెవెన్యూ, వైద్య, విద్యుత్, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభమేళా తరహాలో ఉంటాయని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గోదావరి నది పరివాహకంలో అనువైన ప్రాంతాలలో పుష్కరాల ఏర్పాట్ల కొరకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి కార్యచరణ సిద్ధం చేయాలని తెలిపారు. అధిక సంఖ్యలో మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరంలో పుష్కర స్నానాలు ఆచరిస్తారని, తరువాత గూడెంలో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్థానాలకు హాజరవుతారని తెలిపారు. పార్కింగ్, హోల్డింగ్ ఏరియా,పండల్ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రజా రవాణా వ్యవస్థ, డ్రోన్ ద్వారా పర్యవేక్షణ, పుష్కర ఘాట్ ప్రాంతాలలో లైటింగ్, త్రాగునీటి ఏర్పాట్లపై  ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని, ఈ విషయమై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమీక్ష ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రతిపాదనలు, కార్యచరణ సిద్ధం చేసి అందించాలని తెలిపారు. పుష్కరాలలో భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని,ఈ క్రమంలో మంచిర్యాలలో 2 లక్షల మంది, వేలాలలో 50 వేల మంది, చెన్నూరు ప్రాంతంలో సైతం అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. నీటిపారుదల శాఖ నివేదిక ఆధారంగా నూతన ఘాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వెలుతురు, పారిశుద్ధ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కార్యచరణ రూపొందించాలని తెలిపారు. భక్తుల సంరక్షణ దిశగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో పుష్కర స్నానాల ప్రాంతాలలో గజా ఈతగాళ్లను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని, పుష్కరాల నిర్వహణ కొరకు నోడల్ అధికారులను నియమించడం జరుగుతుందని తెలిపారు.కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉందని, కార్యచరణ రూపొందించడంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యచరణ రూపొందించాలని, పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తదనగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.పుష్కర ఘాట్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :