ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నవంబర్ 30న ఈత చెట్టు పైనుండి కిందపడి చెయ్యి విరిగిన తాళ్లపల్లి సంతోష్ గౌడ్ అనే గీతా కార్మికుని ప్రభుత్వం ఆదుకోవాలని మల్లెపల్లి గీత కార్మిక సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంథని మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన గీతా కార్మికుడు సంతోష్ గౌడ్ ఆదివారం ఈత చెట్టు గీస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన జారీ పడిపోగా చెయ్యి విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు సంతోష్ గౌడ్ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈతచెట్టు పై నుండి కింద పడి చేయి విరగడంతో పని చేయలేని పరిస్థితిలో ఉన్న సంతోష్ గౌడ్ ను ఆదుకోవాలని మల్లెపల్లి గీత కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Admin
E Nivas News