ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టి.జి.ఎం.డి.సి.మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల ప్రాజెక్టు అధికారి పి.రామకృష్ణ మంగళవారంఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక మాఫియా కొనసాగుతుందని, అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని సామాజిక మాధ్యమాలలో వస్తున్న అవాస్తవ కథనాలలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో ఇసుక అక్రమ రవాణా జరగకుండా విస్తృత తనిఖీలు చేపట్టడంతో పాటు సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక రవాణా పారదర్శకంగా లబ్ధిదారులకు అందుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అసంబద్ధమైన, అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు.
Admin
E Nivas News