ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వనదేవతల మహా కుంభమేళా జాతర జనవరి 28 బుధవారంతో ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మ తోపాటు పగిడిగిద్దరాజు గోవింద రాజులను కూడాతీసుకురావడంతో జాతర మహా ఘట్టం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జాతర నిర్వహణను చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని (బెల్లం) బంగారాన్ని సమర్పించుకున్నారు. మంత్రి సీతక్క సైతం అక్కడే ఉండి జాతర పర్యవేక్షణను చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. వచ్చే మూడు రోజులపాటు సమ్మక్క,సారలమ్మ పగిడిగిద్దరాజు వనం నుండి జనంలోకి రావడంతో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా అధికార యంత్రాంగం అక్కడే ఉంది అనిర్వస్తులు ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లుచోటు చేసుకోకుండా పోలీసులుఅనువణువునా గాలిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే పరిస్థితి ఉన్నందున దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నుండే వాహనాలకు పార్కింగ్ ను ఏర్పాటు చేశారు జాతరకు వాహనాల్లో వచ్చే భక్తులంతా ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలుపుకోవాలని పోలీసులుసూచించారు. అనవసరంగా జాతరలోకి వాహనాలు తీసుకువచ్చి ప్రజలకు ఆటంకం కలిగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.
Admin
E Nivas News