Saturday, 13 June 2026 02:26:39 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

28న మేడారం జాతర మహా కుంభమేళా ప్రారంభం..

వనదేవతలను దర్శించుకుంటున్న లక్షలాది మంది భక్తులు

Date : 27 January 2026 08:49 PM Views : 193

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వనదేవతల మహా కుంభమేళా జాతర జనవరి 28 బుధవారంతో ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మ తోపాటు పగిడిగిద్దరాజు గోవింద రాజులను కూడాతీసుకురావడంతో జాతర మహా ఘట్టం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జాతర నిర్వహణను చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని (బెల్లం) బంగారాన్ని సమర్పించుకున్నారు. మంత్రి సీతక్క సైతం అక్కడే ఉండి జాతర పర్యవేక్షణను చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. వచ్చే మూడు రోజులపాటు సమ్మక్క,సారలమ్మ పగిడిగిద్దరాజు వనం నుండి జనంలోకి రావడంతో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా అధికార యంత్రాంగం అక్కడే ఉంది అనిర్వస్తులు ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లుచోటు చేసుకోకుండా పోలీసులుఅనువణువునా గాలిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే పరిస్థితి ఉన్నందున దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నుండే వాహనాలకు పార్కింగ్ ను ఏర్పాటు చేశారు జాతరకు వాహనాల్లో వచ్చే భక్తులంతా ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలుపుకోవాలని పోలీసులుసూచించారు. అనవసరంగా జాతరలోకి వాహనాలు తీసుకువచ్చి ప్రజలకు ఆటంకం కలిగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :