ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదివాసీల ఆరాధ్య దేవతలు కొలువుదీరిన పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇలవేల్పు దైవదర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనే సదాశయంతో శనివారం సిర్పూర్ (యు) మండలం లోని ఖాతిగూడ గ్రామంలోని సెడ్మాకి పరివార్ వారి పెర్సపెన్ దేవుని సన్నిధిలో శనివారం షేడ్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు భూమి పూజ చేశారు. దాంతో పాటు గ్రామంలోని ఆదివాసీల ఆరాధ్య దైవం జంగు బాయి దేవత మఠం , భీమల్ పెన్, అవ్వల్ పెన్ మఠం నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని దేవతల సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతుల ఏర్పాటు కోసం మాజీఎమ్మెల్యేఆత్రంసక్కు చేస్తున్న కృషి చిరస్మరణీయం అంటూ ఆయా గ్రామాల ప్రజలు కొనియాడారు.
Admin
E Nivas News